బాటసింగారం: బాటసింగారం లాజిస్టిక్స్ పార్కులో తాత్కాలిక పండ్ల మార్కెట్ (Fruit Market) ఏర్పాటైంది. శుక్రవారం నుంచి ఈ మార్కెట్లో పండ్ల విక్రయాలు ప్రాంరంభమవుతాయి. గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ నుంచి తాత్కాలికంగా బాటసింగారంలో ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ పండ్ల మార్కెట్ను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. పండ్ల క్రయ, విక్రయాలు కూడా ఆమె చేతుల మీదుగానే మొదలయ్యాయి. ఆపిల్, సంత్ర, ద్రాక్ష, పైనాపిల్ పండ్ల వేలాన్ని ఆమె పరిశీలించారు.