Minister Jagadish Reddy | బసవేశ్వరుడి బోధనలు స్ఫూర్తిదాయకమని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఆదివారం జిల్లా వెనుకబడిన శాఖ ఆధ్వర్యంలో 890వ మహాత్మా జయంతి నిర్వహించారు. కార్యక్రమంత్రి మంత్రి పాల్గొని, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 800 సంవత్సరాల కిందటే సమాజంలో కుల, వర్ణ, లింగ బేధాలు లేవని అందరు సమానమేనని చాటి చెప్పిన ప్రముఖుడు బసవేశ్వరుడని కొనియాడారు. సమాజంలో కుల వ్యవస్థను వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేఖించిన గొప్ప అభ్యుదయవాది అన్నారు.
బసవేశ్వరుడి జయంతి వేడుకలను ప్రభుత్వం ఏటా అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు ప్రభుత్వం సమసమాజ స్థానకు పాటుపడిన వారిని సమర్థిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి తెలిపారు. బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో హైందవ మతాన్ని సంస్కరించిన ప్రముఖుల్లో ఒకరని, కుల, మత భేదాలు లేని సమాజ స్థాపనకే కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడన్నారు. మనుషులందరూ ఒక్కటే, కులాలు, ఉపకులాలు లేవన్న మహాత్మ బసవేశ్వరుడి ఉపదేశాన్ని ప్రజలందరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మహాత్మ బసవేశ్వరుడు చూపిన దారిలో నడవాల్సిన ఆవశ్యకత ఉందని, అదే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళ అన్నారు.
కలెక్టర్ ఎస్ వెంకట్రావ్, లింగాయత్ లింగ బలిజ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బసవేశ్వర జయంతి సందర్భంగా ఆయన చేసిన పోరాటాలను వివరించారు. లింగ బలిజ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ కోరిక మేరకు రుద్రభూమి, బసవ భవన నిర్మాణం అలాగే ఆ ప్రాంగణంలో బసవేశ్వర విగ్రహ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎస్ మోహన్ రావు, డీఆర్వో రాజేంద్ర కుమార్, లింగాయత్ లింగ బలిజ సంఘం అధ్యక్షుడు ఎస్ చంద్రశేఖర్, గౌరవాధ్యక్షుడు ఎస్ఎస్ సోమయ్య, కార్యదర్శి పీ శేఖర్, శాధికారి డీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.