బాసర : బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ హుండీ కానులకను మంగళవారం అధికారులు లెక్కించారు. హుండీల ద్వారా నగదు రూపంలో రూ.78,24,281 ఆదాయం సమకూరగా.. 232 గ్రాముల బంగారం, నాలుగు కిలోల 600 గ్రాముల వెండి, 29 విదేశీ కరెన్సీ నోట్స్ లభించాయి. ఈ మొత్తం ఆదాయం 63 రోజుల్లో వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది, పోలీసు సిబ్బంది, శ్రీజ్ఞాన సరస్వతి సేవాసమితి సభ్యులు, రాజరాజేశ్వర సేవాసమితి కామారెడ్డి జిల్లా, సిరిసిల్ల జిల్లాకు చెందిన భక్తులు పాల్గొన్నారు.