హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): దర్శకుడు రామ్గోపాల్ వర్మపై బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష గురువారం మహిళా కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా శిరీష తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ‘ఊరు.. పేరు లేని ఆవిడ.. బర్రెలక్కగా చాలా ఫేమస్ అయిపోయింది’.. అని అవమానించారని చెప్పారు.
తమ ప్రాంత బిడ్డలను కించపరిచేలా మాట్లాడటం తప్పు అని, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. ఈ విషయంపై న్యాయపోరాటం చేస్తామని న్యాయవాది స్పష్టం చేశారు.