భద్రాద్రి రాములోరి కల్యాణానికి సిరిసిల్ల నేత కార్మికుడు విజయ్ త్రీడీ కలర్ బంగారు చీరను తయారు చేసి ఆదివారం ఆవిష్కరించారు. సీతమ్మ కోసం మూడు వర్ణాలతో త్రీడీ చీరను మగ్గంపై నేశారు. బంగారం, వెండి జరి, ఎరుపు రంగు పట్టుపూలతో.. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగులాల వెడల్పు, 600 గ్రాముల బరువుతో చీరకు తయారుచేశారు.
-రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ)