పెద్దపల్లి: బెంగళూరు నుంచి యశ్వంత్పూర్ వెళ్తున్న రైలు పెద్దపల్లి రైల్వే స్టేషన్ నిలిచిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారణాసికి చెందిన అనిత అనే గర్భిణికి పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. ఆమె కుటుంబీకులు విషయాన్ని టీటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన రైల్వే అధికారులకు సమాచారం అందించడంతో.. వారు 108కు కాల్ చేశారు. ఈ నేపథ్యంలో రైలు పెద్దపల్లి రైల్వే స్టేషన్లో ఆగింది.
అప్పటికే అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది.. ఆమెను 108లో దవాఖానకు తరలిస్తుండగా నొప్పులు అధికమయ్యాయి. దీంతో సిబ్బంది ఆమెకు అంబులెన్స్లోనే పురుడుపోశారు. అనంతరం తల్లీ పిల్లలను పెద్దపల్లి మాతాశిశు హాస్పిటల్కు తీసుకెళ్లారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.