హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖాశర్మకు టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా రాజీవ్సాగర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సంసృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు భారత జాగృతి ద్వారా ఎమ్మెల్సీ కవిత కృషి చేశారన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన ధీరవనిత కవితపై పరుషంగా మాట్లాడిన తీరుపై మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ కోసం కవిత చేస్తున్న ఉద్యమాన్ని జీర్ణించుకోలేక ఆమెపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. బండి సంజయ్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ను కోరారు.