మహదేవపూర్/కృష్ణకాలనీ(కాటారం), ఫిబ్రవరి 24 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలోని ఎల్జీ గార్డెన్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బండి సంజయ్ సభ జనం లేక వెలవెలబోయింది. రెండు నెలలుగా బీజేపీ మంథని నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల సునీల్రెడ్డి నియోజకవర్గంలో చేపట్టిన ప్రజాచైతన్య యాత్ర మొదటి విడత ముగింపు కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మొదట కాటారంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి మద్దులపల్లిలోని ఎల్జీ గార్డెన్ వరకు బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ప్రజల నుంచి స్పందన కరువైంది. అనంతరం గార్డెన్లో ఏర్పాటుచేసిన ప్రజా చైతన్యయాత్ర సభలోనూ ప్రజలు లేక కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.