హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 20: టీఆర్ఎస్పై విషప్రచారం చేస్తూ సానుభూతి ఓట్లు పొందాలని బీజేపీ, ఈటల రాజేందర్ కొత్త డ్రామాకు తెరలేపినట్టు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించా రు. ఒకరిద్దరిని ఆత్మహత్యలకు పురిగొల్పేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. బీజేపీ మాయలో పడి అమాయకులు ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని విజ్ఞప్తిచేశారు. బుధవారం హుజూరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దళితుల బాగు కోసం సీఎం కేసీఆర్ దళితబంధు ప్రారంభించగా.. ఈసీకి లేఖ రాసి పథకాన్ని నిలిపివేయించిన బీజేపీ కుట్రను దళిత సమా జం గుర్తించాలన్నారు. గతంలోనూ బీజేపీ ప్రచారంలో కరెంటు కట్ చేశారని, పెంచిన గ్యాస్ధరలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నదం టూ దుష్ప్రచారం చేశారని గుర్తుచేశారు.
అవన్నీ నిరూపించాలని మంత్రి హరీశ్రావు సవాల్ విసిరితే.. గప్చుప్ అయ్యారని దెప్పిపొడిచారు. అలాగే కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం విషయంలోనూ ఈటల ఆరోపణలు ఎంత నిజమో తేలిపోయిందన్నారు. ఆ కారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి ముఖ్య అనుచరుడు విశ్వనాథ్ వినోద్ది అని నిరూపించడంతో తోక ముడిచారని గుర్తుచేశారు. ఈటల ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తూ, వాటిని టీఆర్ఎస్పై రుద్దుతూ మాట్లాడుతున్నారని మండిపడ్డా రు. పాదయాత్ర ప్రారంభించడం, మోకాలి ఆపరేషన్ పేరుతో విరమించుకోవడం, తన కారుపై తానే దాడి చేయించుకోవడం.. రకరకాల డ్రామాలాడుతున్న ఈటలకు ఆసా ర్ అవార్డు దకుతుందని ఎద్దేవాచేశారు.
ఆత్మాహుతి చేయించడానికి కుట్ర
పోలింగ్ దగ్గరపడుతుండటంతో ఈటల కొత్త నాటకానికి తెరలేపాడని బాల్క అన్నా రు. అనారోగ్యంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒకరిద్దరిని ఈటల కో సం ఆత్మహత్యలు చేసుకునేలా కుటుంబ సభ్యులతో ఒప్పందం చేసుకొన్నట్టు ఆరోపించారు. ఆ నెపం టీఆర్ఎస్పై వేయాలని పథ కం రూపొందించిందని మండిపడ్డారు. కు టుంబానికి రూ.20 లక్షల నుంచి 25 లక్షలు ఇచ్చి, వారితో వీడియోలు తీయించి, లేఖలు రాయించి టీఆర్ఎస్పై విషప్రచారానికి తెరలేపారన్నారు. ఇలాంటి వారికి ఈ నెల 30న జరిగే ఎన్నికలో ప్రజలు ఓటుతో రాజకీయ సమాధి కట్టాలన్నారు.