హైదరాబాద్, జూన్ 10 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో ఉద్యాన ఆధారిత అంకుర పరిశ్రమలకు మంచి భవిష్యత్తు ఉందని తెలంగాణ ఉన్న త విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, ఉ ద్యాన వర్సిటీ వీసీ డీ రాజిరెడ్డి తెలిపారు.
ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో ఉద్యాన పంటల్లో ప్రత్యామ్నాయ పంట యాజమాన్య పద్ధతుల పై ఉద్యా న యూనివర్సిటీ ప్రత్యేక బులిటిన్ వి డుదల చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయానికి రుతుపవనాలు కీలకమని పే ర్కొన్నారు. పంటల సాగులో రు తుపవనాలు ఆ లస్యం కావడం, వర్షాలకు మధ్య చాలా వ్యవధి ఉండటం నష్టం కలిగిస్తున్నదని తెలిపారు.