ఖైరతాబాద్, ఏప్రిల్ 11: బలగం ఫేమ్ గాయకుడు పీ మొగిలయ్య (68)ను మంగళవారం రాత్రి హైదరాబాద్ నిమ్స్ దవాఖానకు తరలించారు. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన మొగిలయ్య గత కొంతకాలంగా మూత్రపిండాలు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.
వరంగల్లోని సంరక్ష దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు నిమ్స్కు తరలించారు. ప్రస్తుతం నిమ్స్ పాత భవనంలోని ఎమ్మార్సీయూ విభాగంలో నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ గంగాధర్ పర్యవేక్షణలో వైద్యులు మొగిలయ్యకు చికిత్స అందిస్తున్నారు.