హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ కమిషనర్గా నియమితులైన బాల మాయాదేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించిన బుర్రా వెంకటేశం స్థానంలో బాల మాయాదేవిని నియమిస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు స్వీకరించిన మాయదేవిని బీసీ సంక్షేమశాఖ జేడీ చంద్రశేఖర్, డిప్యూటీ డైరెక్టర్ సంధ్య, ఫైనాన్స్ మేనేజర్ ఝాన్సీ, ఎంజేపీ సొసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్యభట్టు కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.