Bakka Judson | హైదరాబాద్ : రైతుబంధు నిధుల మళ్లింపుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయిన బక్క జడ్సన్ ప్రశ్నించారు. ఈ రాష్ట్రానికి ఫైనాన్స్ మంత్రి భట్టి విక్రమార్కనా..? మేఘా కృష్ణారెడ్డి తమ్ముడా..? అని నిలదీశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బక్క జడన్స్ బుధవారం మీడియాతో మాట్లాడారు.
మేఘా కృష్ణారెడ్డి తమ్ముడు చిట్టి మీద రాసిస్తే R టాక్స్, B టాక్స్ కట్ చేసి డబ్బులు రిలీజ్ చేస్తున్నారు అని జడ్సన్ ఆరోపించారు. మేఘా కృష్ణారెడ్డి తమ్ముడు ఓ చిన్న చిట్టిపై రాస్తాడు. అదే బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడిన బీ ట్యాక్స్ ఆ ట్యాక్స్ మాట్లాడిండు కదా.. ఆ ట్యాక్స్ ఆ చిన్న చిట్టిపై రాస్తారు. ఆ చిట్టి తీసుకెళ్లి రామకృష్ణ రావు(ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి)కు ఇస్తే ఆ బిల్లు అప్పుడు మీ అకౌంట్లలో పడుతాయి. ఆ ట్యాక్స్లు కట్ అయిన తర్వాత బిల్లులు పడుతాయి. ఇవాళ ఫైనాన్స్ మంత్రి భట్టి విక్రమార్కనా..? మేఘా కృష్ణారెడ్డి తమ్ముడా..? రైతుబంధు కోసం విడుదలైన రూ. 7500 కోట్లు ఏ విధంగా డైవర్ట్ అయ్యాయి..? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని బక్క జడ్సన్ డిమాండ్ చేశారు.
రైతు బంధు పైసలు 7000 కోట్ల రూపాయల నిధులు బదిలీ అయ్యాయి.. ఎక్కడికి డైవర్ట్ చేశారు రేవంత్ రెడ్డి?
మేఘ కృష్ణారెడ్డి తమ్ముడు చిట్టి మీద రాసి ఇస్తే R టాక్స్, B టాక్స్ కట్ చేసి డబ్బులు రిలీజ్ చేస్తున్నారు.. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కనా? మేఘ కృష్ణారెడ్డి తమ్ముడా? – కాంగ్రెస్… pic.twitter.com/9cTZGw5wEN
— Telugu Scribe (@TeluguScribe) April 3, 2024