హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): ఒక మతం మనోభావాలను దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారనే కేసులో అరెస్టయి జైల్లో ఉన్న బైరి నరేశ్ భద్రత కోసమే పరిగి జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించినట్టు న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి హైకోర్టుకు నివేదిక అందజేశారు. ఈ విషయం నరేశ్కు తెలియదని చెప్పారు. నరేశ్ను చర్లపల్లి జైల్లో ఏకాంతంగా నిర్బంధించడం హకుల ఉల్లంఘనగా పరిగణించాలని కోరుతూ అతని భార్య సుజాత హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. వాస్తవ పరిస్థితి పరిశీలించి నివేదిక ఇవ్వాలని జస్టిస్ విజయ్సేన్రెడ్డి గత ఆదేశాలకు అనుగుణంగా కార్యదర్శి నివేదిక సమర్పించారు.
జనవరి 30న నరేశ్ను జైలు సూపరింటెండెంట్ విచారించినట్టు తెలిపారు. పరిగి జైల్లో భత్రద కష్టమని అకడి అధికారులు చెప్పడం వల్లే చర్లపల్లికి తరలించారని, విచారణ ఖైదీలు 20 మందితో నరేశ్ ఉన్నాడని, 14 రోజులపాటు సెల్లోనే అన్నం పెట్టారని, ఇప్పుడు ఖైదీలందరితో కలిపి పెడుతున్నారని చెప్పారు. మానస సరోవర్ బ్యారక్లో ఉన్నాడని, ములాఖత్పై ఫిర్యాదులు లేవని, వైద్య పరీక్షలు కూడా చేస్తున్నారని, అదే బ్యారక్లో రేప్, మర్డర్ కేసు నిందితుడు నాగేశ్వరరావు కూడా ఉన్నాడని తెలిపారు. ఈ నివేదికను పరిశీలించిన హైకోర్టు, దానిపై వివరణ ఇవ్వాలని పిటిషనర్ను ఆదేశించింది.