అంబర్పేట, సెప్టెంబర్ 22: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సొంత ఇలాకాలో ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ పరిధిలోని బాగ్అంబర్పేట డివిజన్కు చెందిన బీజేపీ కార్పొరేటర్ బీ పద్మ, ఆమె భర్త బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా ఇన్చార్జి, బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షుడు వెంకట్రెడ్డి.. బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో శుక్రవారం ప్రగతిభవన్లో గులాబీ కండువా కప్పుకొన్నారు. వెంకట్రెడ్డి దంపతుల వెంట బీజేపీ నేతలు మల్లారెడ్డి, మిర్యాల శ్రీనివాస్, గోవిందు అర్జున్, రమేశ్ ముదిరాజ్, బాలకృష్ణగౌడ్ తదితరులు బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి తాము దృఢమైన కార్యకర్తగా పని చేస్తామని వెంకట్రెడ్డి తెలిపారు. వెంకట్రెడ్డి 43 ఏండ్లుగా బీజేపీలో కొనసాగారు. ఆలె నరేంద్ర వెంట ఉంటూ అంబర్పేటలో బీజేపీ బలోపేతానికి కృషి చేశారు. రెండు పర్యాయాలు గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన వెంకట్రెడ్డి.. 2002లో బర్కత్పుర డివిజన్ (అప్పట్లో హిమాయత్నగర్ నియోజకవర్గం) కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వెంకట్రెడ్డి భార్య పద్మ బాగ్అంబర్పేట డివిజన్ నుంచి బీజేపీ తరఫున గెలుపొందారు. వెంకట్రెడ్డి 2014 ఎన్నికల్లో మలక్పేట నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమి చెందారు. గతంలో కిషన్రెడ్డి గెలుపులో వెంకట్రెడ్డి కీలక పాత్ర పోషించారు.
కిషన్రెడ్డితోనే బీజేపీ నాశనం : వెంకట్రెడ్డి, పద్మ దంపతులు
బీజేపీకి చేసే ముందు వెంకట్రెడ్డి, పద్మ దంపతులు వారి నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ కోసం 43 ఏండ్లుగా కష్టపడి పనిచేసినా ఏమాత్రం గుర్తింపులేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంబర్పేటలో ఆలె నరేంద్ర వేరే పార్టీ పెట్టినప్పటికీ తాను బీజేపీలోనే కొనసాగుతూ పార్టీని బలోపేతం చేశానని స్పష్టంచేశారు. రాష్ట్రంలో బీజేపీ నాశనానికి కిషన్రెడ్డినే కారణమని మండిపడ్డారు.