Badibata | హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల్లో అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమానికి అద్భుత స్పందన కొనసాగుతున్నది. ఈ కార్యక్రమం ద్వారా జరిగిన అడ్మిషన్ల సంఖ్య గురువారంతో లక్ష దాటింది.
ఒకటో తరగతిలోకి ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా 9,866 అడ్మిషన్లు రాగా, ప్రైవేట్ స్కూళ్ల నుంచి 1154 మంది వచ్చారు. 433 మంది నేరుగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందారు. మొత్తంగా ఒకటో తరగతిలో 13,453 అడ్మిషన్లు నమోదయ్యాయి.
9130 మంది ప్రైవేట్ పాఠశాల్లలో చదువుతూ 2-10 తరగతుల మధ్య ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ పొందారు. మొత్తంగా గురువారం 22,583 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. దీంతో రాష్ట్రంలో బడిబాట ద్వారా జరిగిన మొత్తం అడ్మిషన్ల సంఖ్య 1,14,257గా నమోదైంది.