Bandi Sanjay | పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ని పోలీసులు వరంగల్ మొదటి సెషన్స్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరుచగా.. న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఆయన 19 వరకు రిమాండ్లోనే ఉండనున్నారు. అయితే, పోలీస్ అధికారులు ఖమ్మం జైలుకు తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు పోలీసులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత బండి సంజయ్ న్యాయవాదులు కరీంనగర్కు తరలించేలా న్యాయమూర్తిని కోరగా.. ఇందుకు అనుమతి ఇచ్చారు. న్యాయమూర్తి ఆదేశాల నేపథ్యంలో పోలీసులు కరీంనగర్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ని పోలీసులు ఏ1గా చేర్చారు.