రామారెడ్డి, నవంబర్ 8: సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్పై దుష్ప్రచారంరామారెడ్డి మండలం మోషంపూర్కు చెందిన రాజు గత రెండు రోజులుగా మంత్రి కేటీఆర్ చేయని వ్యాఖ్యలు చేసినట్టు నమస్తే తెలంగాణ పత్రిక పేరిట ప్రచారం చేస్తున్నాడు. మునుగోడు ఎన్నికలపై తప్పుడు వ్యాఖ్యలు చేసినట్టు సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడు. ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్న రాజుపై చర్యలు తీసుకోవాలని నమస్తే తెలంగాణ ప్రతినిధులు.. ఎస్సైకి ఫిర్యాదు చేశారు.