హైదరాబాద్ : అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల ఎజెండాతో పాటు ఎన్ని రోజుల పాటు కొనసాగించాలనే అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇవాళ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీశ్రావు సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మండలిలో వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. అసెంబ్లీ సమావేశాలను బుధవారానికి వాయిదా వేశారు.