కాసిపేట, సెప్టెంబర్ 6: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కొలాంగూడకు చెందిన టేకమ్ మారు భీంబాయి(22) కూతురి నా మకరణం కార్యక్రమం మంగళవారం ఏర్పా టు చేశారు. నామకరణ కార్యక్రమం జరుగుతుండగా.. ఇంట్లో గిన్నెలు తీసే క్రమంలో భీంబాయి భర్త మారు విద్యుత్తు తీగలు తాకి షాక్కు గురయ్యాడు. కుటుంబీకులు కరెంటు సరఫరాను నిలిపేశారు. అప్పటికే మారు మృతిచెందాడు. మారు కొడుకు దేవాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.