జన్నారం, మే 6: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్లోని శ్రీలంక కాలనీలోగల చెత్త కుప్పలో ఓ పసికందు కనిపించింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు చెత్తకుప్పలో నుంచి పాప ఏడుపులు వినిపించాయి. అదే కాలనీకి చెందిన ఓ యువకుడు గుర్తించి వెంటనే పోలీసుకు సమాచారం అందించాడు.
పోలీసులు అక్కడికి చేరుకొని పాపను స్థానిక పిల్లల దవాఖానకు తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం పాప పరిస్థితి బాగానే ఉన్నట్లు డాక్టర్ తెలిపారు. లక్షెట్టిపేట సీఐ నరేందర్, ఎస్ఐ రాజవర్ధన్ సూచన మేరకు పాపను మంచిర్యాలలోని సమగ్ర శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. చెత్తకుప్పలో పసికందు లభ్యమవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.