ఎంజీఎంకు తరలించిన ఐసీడీఎస్ అధికారులు
ఖిలావరంగల్, ఆగస్టు 16 : శ్మశానవాటికలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలేసిన ఘటన సోమవారం వరంగల్ నగరంలోని శివనగర్ వెలుగుచూసింది. పసికందు ఏడు పు విన్న ఓ వ్యక్తి సమీపం లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలు సుభద్రకు చెప్పారు. దీంతో ఆమె అక్కడికి వెళ్లి చూడగా ప్లాస్టిక్ కవర్లో రెండు రోజుల వయసున్న మగ శిశువు కనిపించాడు. వెంటనే పసికందును బయటకు తీసి శుభ్రం చేసి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి మిల్స్కాలనీ పోలీసులు, 34వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్కుమార్ చేరుకొన్నారు. ఐసీడీఎస్ అధికారుల ద్వారా పసికందును ఎంజీఎం దవాఖానకు తరలించారు.