కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 14: అన్ని కులాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. కరీంనగర్లోని సీతారాంపూర్లోనిర్మించిన పద్మశాలీ సంఘం హాస్టల్ భవనాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్రావుతో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రతి కుల సంఘానికి ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం హైదరాబాద్లో స్థలాన్ని కేటాయించడంతోపాటు భవన నిర్మాణానికి కోట్లాది నిధులు వెచ్చిస్తున్నారని తెలిపారు. 75 ఏండ్లుగా ఈ ఆలోచన ఏ ప్రభుత్వానికీ, ఏ నాయకుడికీ రాలేదన్నారు. మంత్రి గంగుల మాట్లాడుతూ.. అన్ని కుల సంఘాలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు. కులవృత్తుల రక్షణ కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు.