భద్రాచలం, మార్చి 4: దక్షిణ అయోధ్యపురి భద్రాద్రిలో కొలువైన రామయ్య కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆలయ వైదిక కమిటీ ఈ మే రకు సోమవారం ఆలయ ఈవో రమాదేవికి నివేదిక అందించింది. ఏప్రిల్ 17న పట్టణంలోని మిథిలా ప్రాంగణంలో శ్రీరామనవమి సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు.
తదుపరి రోజు శ్రీరామయ్యకు మహాపట్టాభిషేకం చేయనున్నా రు. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 9 నుంచి ఆలయ సన్నిధిలో 23వ తేదీ వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి నవాహ్ని తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు స్వామివారి నిత్యకల్యాణం, దర్బార్ సేవలు, ఏప్రిల్ 9 నుంచి మే 1 వరకు పవళింపు సేవలు నిలిపివేస్తున్నట్టు ఆలయ ఈవో తెలిపారు.