హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఇటీవల తరచు చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలపై రాష్ట్ర అగ్నిమాపకశాఖ అప్రమత్తమయ్యింది. శీతాకాలంలో చలిమంటలు, గ్యాస్ సిలిండర్ పేలుడు, గడ్డివాముల దగ్ధం వంటి ఘటనలపై రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 84 ప్రాంతాల్లో మాక్డ్రిల్స్ నిర్వహించింది. ఫైర్ సేఫ్టీ అవగాహనలో భాగంగా పెట్రోల్ బంక్లు, పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలు, అపార్ట్మెంట్లు, షాపింగ్మాల్స్ వంటి వివిధ ప్రాంగణాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగాయి. అగ్ని ప్రమాదాలు, విపత్తులు సంభవిస్తే 101కు డయల్ చేయాలని అధికారులు, సిబ్బంది ప్రజలకు విజ్ఞప్తి చేశారు.