హైదరాబాద్: సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకంలో తెలంగాణలోని పల్లెలు దేశంలోనే అగ్రభాగాన నిలవడానికి సీఎం కేసీఆర్ కృషే కారణమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. గ్రామాల అభ్యున్నతికి కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యంతోనే అవార్డులు వచ్చాయని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, గ్రామాల రూపు రేఖలు మారాయని మంత్రి తెలిపారు.
గ్రామాలను అభివృద్ధి చేసేందుకు అన్ని గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. పల్లెలకు ప్రతి నెలా నిధులు విడుదల చేస్తున్నామని, ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శిని నియమించి పనులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఎంపీలు తాము దత్తత తీసుకున్న గ్రామాలను అభివృద్ధి చేయడంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్న సర్పంచ్లు, కార్యదర్శులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను ఎర్రబెల్లి అభినందించారు.