హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ఆలిండియా బజ్మే రహ్మతే ఆలం సంస్థ ప్రతి సంవత్సరం అందజేసే శాంతి పురస్కారాన్ని ఈ ఏడాదికి ప్రముఖ పాత్రికేయులు, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్, బుద్ధవనం ప్రాజెక్టు ఓఎస్డీ మల్లేపల్లి లక్ష్మయ్యకు ప్రదానం చేసింది. మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకొని హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఆలిండియా బజ్మే రహ్మతే ఆలం సంస్థ అధ్యక్షుడు ఎంఏ ముజీబ్ అవార్డును అందజేశారు. మత సామరస్యం, సమాజసేవను ప్రోత్సహించే ప్రముఖ వ్యక్తులకు ఈ పురస్కారం ఇస్తారు. కార్యక్రమంలో మతగురువులు మౌలాన సయ్యద్ సాదత్ పీర్ బాగ్దాది, సయ్యద్ మతీన్ అలీషా ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.