హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): వ్యాపారాన్ని సులభతరం చేయడం (ఈవోడీబీ)లో అత్యుత్తమ ప్రతిభ చూపిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రఖ్యాత బిజినెస్ మ్యాగజైన్ ‘ఎకనమిక్ టైమ్స్’ అవార్డును ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు అత్యుత్తమంగా ఉన్నాయని ప్రశంసించింది. ఈ నెల 25న ఢిల్లీలో నిర్వహించే ‘డిజిటెక్ కాంక్లేవ్ 2022’లో తెలంగాణ ప్రభుత్వానికి ఈ పురసారాన్ని అందజేయనున్నది.
నీతి ఆయోగ్, కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖతోపాటు ఇజ్రాయెల్, స్వీడన్ రాయబార కార్యాలయాలు ఈ కాంక్లేవ్కు సహకారాన్ని అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ శాఖలు విడుదల చేసిన నివేదికలతోపాటు క్షేత్రస్థాయిలో జరిపిన విస్తృత పరిశోధన, అధ్యయనం ఆధారంగా తెలంగాణను అవార్డుకు ఎంపిక చేసినట్టు వివరించింది. వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు అమలుచేస్తున్న సంస్కరణలతోపాటు ‘మీ సేవ’ పోర్టల్ ద్వారా ప్రజలకు మెరుగైన డిజిటల్ సేవలను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని సతరించాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్కు రాసిన లేఖలో ‘ఎకనమిక్ టైమ్స్’ ఎడిటర్ టీ రాధాకృష్ణ తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ అత్యుత్తమ సేవలకు నిదర్శనం
ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఎకనామిక్ టైమ్స్ పురసారం మరో నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఈవోడీబీ ర్యాంకుల్లో తెలంగాణ ఎల్లప్పుడూ అగ్రస్థానంలోనే ఉన్నది. తెలంగాణ ప్రభుత్వ విధానాలపై విసృ్తతమైన పరిశోధన చేసిన ‘ఎకనమిక్ టైమ్స్’ పత్రికకు ధన్యవాదాలు.
– మంత్రి కేటీఆర్