ఉప్పల్, డిసెంబర్ 20: నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్టు డాక్టర్ అభయ్రామ్ బన్సాల్ ఐజీయూ- అన్నీ తల్వానీ మెమోరియల్ అవార్డు-2021కు ఎంపికయ్యారు. షిల్లాంగ్లో 2022 ఫిబ్రవరిలో జరిగే ఐజీయూ 58వ వార్షిక సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. డాక్టర్ బన్సాల్ భూకంప ప్రేరేపణ, హైడ్రోకార్బన్ అన్వేషణ, భూఉష్ణ అధ్యయనాలపై గణనీయమైన పరిశోధనలు చేశారు. నేషనల్ అకాడమీ ఆఫ్ సైస్సెస్ ఫెలోగా ఉన్నారు. జాతీయ ఖనిజ పురస్కారం-2005, కృష్ణన్ స్వర్ణ పతకం-2008 పొందారు. పుల్బ్రైట్ నెహ్రూ సీనియర్ రిసెర్చ్ ఫెలోషిప్, జేఎస్ పీఎస్ ఇన్విటేషన్ ఫెలోషిప్, యూనివర్సిటీ ఆఫ్ టోక్యోలో విజిటింగ్ అసోసియేట్ ప్రొఫెసర్షిప్, బాయ్ స్కాట్ ఫెలోషిప్, యుకేఐఈఆర్ఐ రిసెర్చ్ ఫెలోషిప్లు కూడా అందుకున్నారు.