హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డెంగ్యూ సహా సీజనల్ జ్వరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం విసృ్తత చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీతోపాటు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో విస్తరిస్తున్న డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి సీజనల్ జ్వరాలను నియంత్రించడానికి వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్శాఖ అధికారులను, క్షేత్రస్థాయిలో డాక్టర్లు, సిబ్బంది, మున్సిపల్ అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
తీవ్రమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కంటి లోపలి భాగంలో నొప్పి, వాంతులు, విరేచనాలు, కండరాలు, కీళ్ల నొప్పులు, చ ర్మంపై దద్దుర్లు, పంటి చిగుళ్ల రక్తస్రావం (తీవ్రమైన కేసుల్లో), డెంగ్యూ హెమరేజిక్ (రక్తస్రావం) జ్వరం లక్షణాలు ఉంటాయి.
ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా డెంగ్యూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు. జ్వరం వచ్చిన మొదటి రోజు నుంచి ఐదవ రోజు వరకు ఎన్ఎస్1 ఎలీసా, ఆరవ రోజు నుంచి ఐజీఎం ఏసీ ఎలీసా పరీక్షలు ఎస్ఎస్హెచ్ సెంటర్లో ఉచితంగా చేస్తారు.
ఎడిస్ ఈజిప్టి దోమకాటు ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ దోమలు ఇండ్లలో, ఇంటి కృత్రిమ నీటి నిల్వ ప్రదేశాల్లోఎకువగా పెరుగుతాయి. ఎడిస్ దోమలు పగటి వేళలో కుడతాయి.