TSRTC | హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): జిల్లాకేంద్రాల్లో టీఎస్ ఆర్టీసీ కొత్తగా ‘పల్లెవెలుగు టౌన్ బస్పాస్’ను ప్రవేశపెడుతున్నది. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు 800, ఐదు కిలోమీటర్లకు 500గా ధరను సంస్థ ఖరారు చేసింది. మొదట కరీంనగర్, మహబూబ్నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ఈ పాస్ మంగళవారం నుంచి అమలుచేయనున్నది. హైదరాబాద్లోని బస్భవన్లో ‘పల్లెవెలుగు టౌన్ బస్పాస్’ పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సోమవారం ఆవిషరించారు.
వాస్తవానికి 10 కిలోమీటర్లకు 1200, ఐదు కిలోమీటర్లకు 800 ధర ఉండగా.. సంస్థ రాయితీ కల్పించిందని ఎండీ తెలిపారు. “జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరువ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారి ఆర్థిక భారం తగ్గించేందుకు “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ఈ పాస్ ను అమలు చేస్తున్నాం. ప్రయాణికుల ఫీడ్ బ్యాక్ ను బట్టి మరిన్ని ప్రాంతాలకు పల్లె వెలుగు టౌన్ బస్ పాస్ ను విస్తరిస్తాం. వాస్తవానికి 10 కిలోమీటర్ల పరిధికి రూ.1200, 5 కిలోమీటర్ల పరిధికి రూ.800 ధర ఉండగా.. ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించాలని ఆ బస్ పాస్ లకు సంస్థ రాయితీ కల్పించింది. 10 కిలోమీటర్ల పరిధికి రూ.800, 5 కిలో మీటర్ల పరిధికి రూ.500గా పాస్ ధరను నిర్ణయించింది. కొత్తగా తీసుకువచ్చిన ఈ పాస్ ను హైదరాబాద్, వరంగల్ లో మాదిరిగానే ప్రయాణికులు ఆదరించి.. సంస్థను ప్రోత్సహించాలి.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు.
ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల ఆర్ధిక భారం తగ్గించేందుకు కొత్తగా “పల్లెవెలుగు టౌన్ బస్ పాస్”కు #TSRTC శ్రీకారం చుట్టింది. మొదటగా కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్ ను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది.
ఈ టౌన్… pic.twitter.com/FxqcxdpFKi
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) July 17, 2023
బస్పాస్ వివరాలకు కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఈడీలు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వినోద్కుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.