ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 25: మనిషి ప్రమేయం లేకుండా సొంతంగా నడిచే అటానమస్ డ్రోన్లను ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు రూపొందించారు. ప్రొఫెసర్ ఉమామహేశ్వర్ పర్యవేక్షణలో కాలేజీలోని సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజినీర్స్-ఇండియా క్లబ్ విద్యార్థులు ఈ డ్రోన్ల(యురేకా, ఫాల్కోన్స్)ను తయారుచేశారు.
ఈ విద్యార్థులంతా సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, మైనింగ్ విభాగాలకు చెందినవారు. ఈ డ్రోన్లను చెన్నైలోని కేసీజీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న అటానమస్ డ్రోన్ డెవలప్మెంట్ చాలెంజ్-2023లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, ఆయా విభాగాధిపతులు, క్లబ్ ఫ్యాకల్టీ అడ్వైజర్ డాక్టర్ మధుసూదన్రాజు, డాక్టర్ లింగస్వామి తదితరులు అభినందించారు.