హనుమకొండ చౌరస్తా, మే 7: ఫ్రీ బస్సు పథకం పెట్టి తమ పొట్టకొట్టిన కాంగ్రెస్ను పార్లమెంట్ ఎన్నికల్లో బొందపెడుతామని ఆటోడ్రైవర్ స్వామి పేర్కొన్నాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం హనుమకొండ చౌరస్తా మీదుగా వెళ్తుండగా జూనియర్ కాలేజీ సిగ్నల్ వద్ద ఆటోడ్రైవర్ స్వామిని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ పలుకరించారు.
ఈ సందర్భంగా.. ఆటోడ్రైవర్లకు గిరాకీ వస్తుందా? అని అడుగగా.. ఫ్రీ బస్సు పథకం పెట్టాలని కాంగ్రెస్ను ఎవరైనా అడిగారా? వాళ్ల స్వార్థం కోసం పెట్టారని, రేవంత్రెడ్డి వచ్చి తమ పొట్ట కొట్టిండని వాపోయా డు. మరి ఆటోడ్రైవర్లు ఎవరికి ఓటు వేస్తారని అడగ్గా.. పక్కాగా బీఆర్ఎస్కే ఓటు వేస్తారని సమాధానం ఇచ్చాడు.