కరీంనగర్ కమాన్చౌరస్తా, మార్చి 24: కరీంనగర్ జిల్లా కేంద్రం మహాత్మా జ్యోతిబాఫూలే సర్కస్ గ్రౌండ్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో ఎక్స్పో గ్రాండ్ సక్సెస్ అయింది. ఆదివారం ఈ ఎక్స్పో ముగింపు వేడుకను అట్టహాసంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కరీంనగర్ ఆర్డీవో కే మహేశ్వర్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బాలభవన్ సంగెం రాధాకృష్ణ బృందం చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ షోలో మెయిన్ స్పాన్సర్ ఆదర్శ ఆటో మోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అసోసియేట్ స్పాన్సర్లు మహావీర్ గ్రూప్ మెర్సిడెస్ బెంజ్, ఆడి హైదరాబాద్, వోల్వో, మహావీర్ ఐసుజు, ప్రైడ్ జీప్, గ్రీన్ హోండా, మోటార్ లైన్ మహీంద్ర డీలర్, క్వాంటం ఈ స్కూటర్స్, కాకతీయ టయోటా, మారుతి సుజుకి, నెక్సా, మారుతి సుజుకి అరేన, ఆదర్శ ట్రూ వాల్యూ, మాలిక్ కియా, హమారా సుజుకి సంస్థలతోపాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదితర బ్యాంకులు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. చివరి రోజు సందర్శకులు భారీగా తరలివచ్చి ఆకట్టుకునేలా బుకింగ్స్ చేశారు.
వాహన ప్రియులకు సువర్ణావకాశం
ఒకే దగ్గర అన్ని రకాల వాహనాలు ఉంచడం వాహన ప్రియులందరికీ మంచి అవకాశం. ఇందుకు ‘నమస్తే తెలంగాణ’ బాధ్యతయుతంగా వ్యవహరించింది. మారుతి నుంచి మెర్సిడెజ్ వరకు అన్ని వర్గాలకు అందుబాటు ఉండేలా వాహనాలు, వాటి కొనుగోలు కోసం బ్యాంకులను అందుబాటులో ఉంచడం అభినందనీయం.
-కొండూరి రవీందర్రావు, నాఫ్స్కాబ్ చైర్మన్
ఒకే చోట అన్ని రకాల వాహనాలు
కరీంనగర్ నగరంలోని సెంటర్ ఆఫ్ సీటీలో ‘నమస్తే తెంగాణ’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో ఎక్స్పోలో అన్ని రకాల కంపెనీలకు చెందిన వాహనాలున్నాయి. మార్కెట్లో ఉన్న కొత్త వాహనాలతోపాటు ఎక్సేంజ్ చేసుకునే అవకాశం కల్పించడం సంతోషకరం. షోరూంకు పోయి ఒక వాహనం చూడగలం. ఇక్కడ అన్ని రకాల కంపెనీల వాహనాలను అందుబాటులో ఉంచిన ‘నమస్తే తెంగాణ’కు అభినందనలు.
-కే మహేశ్వర్, కరీంనగర్ ఆర్డీవో