వరంగల్చౌరస్తా, మార్చి 18: అప్పుల బాధతో ఆటోడ్రైవర్ బలవన్మరణానికి పాల్పడిన ఘటన వరంగల్ నగరంలోని ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ షుకూర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన కుండె శ్రీనివాస్ (40) ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఏడు నెలల క్రితం ఆటో కొనుగోలు చేశాడు. గిరాకీ లేకపోవడంతో నెలవారీగా కిస్తీలు చెల్లింపునకు సైతం ఇబ్బందులు పడుతున్నాడు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్తాపానికి గురైన శ్రీనివాస్ మంగళవారం రాత్రి వరంగల్ బస్స్టాండ్ సెంటర్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గుర్తించిన స్థానికులు బాధితుడిని 108 వాహనంలో ఎంజీఎంహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ రాత్రి 11.30 గంటలకు మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.