హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లా కేంద్రంలోని జబిందా మైదానంలో ఈ నెల 24న బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న భారీ బహిరంగసభకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్, కంధార్-లోహా సభలను విజయవంతం చేసిన స్ఫూర్తితో ఆ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఔరంగాబాద్ బహిరంగసభను అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో విజయవం తం చేయాలని భావిస్తున్నాయి. ఔరంగాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో గ్రామగ్రామాన తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించే ప్రచార రథాలు తిరుగుతున్నాయి. కంధార్-లోహా సభ కన్నా ఔ రంగాబాద్ సభకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశాలున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అందుకు అనుగుణంగా ఏర్పా ట్లుచేస్తున్నది.
బుధవారం బహిరంగ సభ జరిగే జబిందా మైదానంలో పీయూసీ చైర్మ న్ ఆశన్నగారి జీవన్రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఐడీసీ చైర్మన్ సముద్రాల వే ణుగోపాలాచారి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ, మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాణిక్ కదం, షేత్కారి సంఘటన్ మహారాష్ట్ర అధ్యక్షుడు, బీఆర్ఎస్ నేత సుధీర్ సు ధాకర్రావు బిందు, ప్రముఖ వాస్తు నిపుణుడు తేజ శర్మ, యువ నాయకులు అం కిత్ యాదవ్, శివాంక్ యాదవ్తోపాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. నాయకులు జబిందా మైదానమంతా తిరిగి ఏర్పాట్లపై చర్చించారు. వాహనాల పార్కింగ్ స్థలాల ఎంపిక చే యాలని స్థానిక బీఆర్ఎస్ నాయకులకు ఎమ్మెల్యే జీవన్రెడ్డి సూచనలు చేశారు.
మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలా?
దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచిన మ హారాష్ట్రలో రైతు ఆత్మహత్యలా? అని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి ప్రశ్నించారు. సభా ఏర్పాట్ల పరిశీలన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభు త్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో అన్నదాతలు సంతోషంగా ఉండటమే కాకుండా రైతు ఆత్మహత్యల్లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం సాధ్యమైనప్పుడు మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాదని ఆయన ప్రశ్నించారు.