బీజేపీ నేతలు, స్వామీజీలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సాగించిన బేరసారాలకు సంబంధించిన ఆడియో టేపులను సంబంధిత వర్గాలు ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపినట్టు తెలుస్తోంది. ఆడియో టేపులతోపాటు మరికొన్ని ఆడియో, వీడియో టేపులను కూడా ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. వీటి నివేదికలు కూడా వచ్చినట్టు సమాచారం. శనివారం మరికొన్ని ఆడియో, వీడియోలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది.
బీజేపీ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించడం దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. బీజేపీ కుట్రను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటపెట్టగా.. టీఆర్ఎస్ డ్రామా ఆడుతోందని బీజపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్రెడ్డితో బీజేపీ తరఫున రామచంద్రభారతి బేరసారాలు జరిపిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో బయటికొచ్చింది.
ఆ తర్వాత కాసేపటికే ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కుట్రకు సంబంధించి మరో ఆడియో లీక్ అయ్యింది. ఈ రెండో ఆడియో కూడా రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మొత్తం 27 నిమిషాల నిడివిగల ఈ ఆడియోలో నందు అనే వ్యక్తి రామచంద్రభారతి, సింహయాజి అనే ఇద్దరు స్వామీజీలతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లపై చేసిన సంభాషణలు ఉన్నాయి. ఈ లీకైన ఆడియోలతో బీజేపీ చేసిన కుట్ర బయటపడింది.