హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ వేళ విచిత్ర సన్నివేశం చోటుచేసుకున్నది. ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అసెంబ్లీలో ప్రత్యక్షమయ్యారు. మొన్న స్పీకర్ ఎ దుట విచారణకు హాజరైన సందర్భం లో తాను కాంగ్రెస్లో చేరలేదని, అది బీఆర్ఎస్ నేతల అపోహ అని బుకాయించిన కడియం.. అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ నేతలతో చెట్టాపట్టాలేసుకొని తిరగడం కనిపించింది. ఆయనను చూసి మీడియా ప్రతినిధులు ‘కడియం సారు.. ఇదేం తీరు..’ అంటూ గుసగుసలాడుకున్నారు. ఆయన కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులకు మద్దతుగానే నామినేషన్ ప్రక్రియకు హాజరయ్యారని భావిస్తున్నారు.