హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): వరంగల్, నిజామాబాద్లో న్యాయవాదులపై జరిగిన దాడి ఘటనలను హైకోర్టు సుమోటోగా తీసుకొంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ హామీ ఇచ్చా రు. సీజే హామీతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కోర్టుల బహిష్కరణను విరమిస్తున్నట్టు బార్ అసోసియేషన్లు ప్రకటించాయి. తెలంగాణ బా ర్ కౌన్సిల్, హైకోర్టు బార్ అసోసియేషన్, వరంగల్, నిజామాబాద్ బార్ అసోసియేషన్ల ప్రతినిధులు మంగళవారం హైకోర్టు సీజేను ఆయన చాంబర్లో కలిశారు. వరంగల్, నిజామాబాద్లో జరిగిన ఘటనలను సీజేకి వివరించారు.