రాంగనర్, డిసెంబర్ 1: అధిక వడ్డీకి డబ్బులు ఇచ్చి ఓ పాఠశాల చైర్మన్ మృతికి కారణమైన ఏఎస్ఐ మోహన్రెడ్డిని పోలీసు శాఖ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 2015లో కెన్క్రెస్ట్ పాఠశాల అధినేత రామవరపు ప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మృతికి ఏఎస్ఐ మోహన్రెడ్డి వేధింపులే కారణమని లేఖ రాశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపగా మోహన్రెడ్డి పలువురు పోలీసు అధికారులకు బినామీగా పని చేసినట్టు తేలింది.
కోట్లాది రూపాయలు వడ్డీకి ఇచ్చి ఆస్తులను బలవంతంగా లాక్కున్నట్టు అనేక ఉదంతాలు వెలుగు చూశాయి. ఈ ఘటన సంచలనం రేపింది. ఈ ఘటనపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా జగిత్యాల ఎస్పీ సింధుశర్మను నియమించారు. ఆమె 11 మందిని ప్రత్యక్షంగా విచారించినివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించారు. మోహన్రెడ్డి బోయవాడలో ఫైనాన్స్ కార్యాలయాన్ని స్థాపించి మనీ ల్యాండరింగ్ యాక్టు నిబంధనలు ఉల్లంఘించి వడ్డీకి డబ్బులివ్వడమే కాకుండా వారి ఆస్తులను తన తండ్రి ఆదిరెడ్డి, భార్య లత, బావ శ్రీధర్రెడ్డి పేరుపై జీపీఏ చేసి లాక్కున్నట్టు నివేదికలో పేర్కొన్నారు.