హైదరాబాద్ : వైఎస్ వివేకా హత్యకేసులో నిందితుడు కడప ఎంపీ అవినాష్రెడ్డి అనుచరులు(Followers) శుక్రవారం హైదరాబాద్ మీడియాపై దాడి(Attack) చేశారు. శుక్రవారం సీబీఐ ఎదుట అవినాష్రెడ్డి (MP Avinash Reddy) హాజరు కావాల్సి ఉండగా అందుకు సంబంధించిన అవినాష్ వాహనాన్ని కవరేజ్ చేస్తున్న మీడియా(Media) పై దాడులకు పాల్పడ్డారు. కెమెరా(Camera) లాక్కొని పలు మీడియా వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. కారును ఆపి కెమెరామెన్, సంబంధిత రిపోర్టర్పై దాడికి పాల్పడి కెమెరాను పగులగొట్టారు. పై అనుచిత వ్యాఖ్యాలతో దురుసుగా ప్రవర్తించారు. మరికొందరిపై అనుచితంగా ప్రవర్తించారు.
శుక్రవారం సీబీఐ విచారణకు హాజరు కావాలని గత మూడు రోజుల క్రితం పులివెందుల( Pulivendula)లోని అవినాష్రెడ్డి ఇంటికి వెళ్లి సీబీఐ అధికారులు నోటీసు అందజేశారు. తనకు ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున హాజరు కాలేనని నాలుగు రోజులు గడువు కావాలని సీబీఐని కోరగా అందుకు సీబీఐ తిరస్కరించి రెండురోజులు మాత్రమే గడువిచ్చి ఈనెల 19న రావాలని నోటీస్లో పేర్కొన్నారు.
అయితే శుక్రవారం తన తల్లి అనారోగ్యం(Mother illness)తో ఉన్నారనే సమాచారంతో ఆయన హడావుడిగా పులివెందులకు బయలు దేరారు. తన తల్లికి గుండెపోటు వచ్చిందని విచారణకు రాలేనని సీబీఐకి ఆయన సమాచారం అందించారు. ఇందుకు సంబంధించిన లిఖితపూర్వకంగా తెలియజేయడానికి అవినాష్రెడ్డి న్యాయవాదులు(Advocates) సీబీఐ కార్యాలయానికి వెళ్లి లేఖను అందజేశారు.