హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ ప్రారంభమైంది. వాహనాల పెండింగ్ చలాన్ డిస్కౌంట్కు విశేష స్పందన లభిస్తోంది. ప్రతి నిమిషానికి 700 పెండింగ్ చలాన్లను వాహనదారులు క్లియర్ చేస్తున్నారు. ఆన్లైన్, ఈ-చలాన్ వెబ్సైట్ ద్వారా పెండింగ్ చలాన్లను క్లియరెన్స్ చేస్తున్నారు. తొలి 8 గంటల్లో 1.77 లక్షల చలాన్లు చెల్లింపులు చేశారు. ఈ చలాన్ల చెల్లింపుల ద్వారా రూ. 1.77 కోట్లు జమ అయ్యాయి. ఈ చలాన్ల వెబ్సైట్ (https://echallan.tspolice. gov.in)లో ప్రత్యేక లింక్ అందుబాటులోకి వచ్చింది. ఈ నెలాఖరు వరకు ఈ అవకాశం ఉంటుందని పోలీసువర్గాలు తెలిపాయి.
ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై 75శాతం మాఫీ చేయగా.. 25శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఆర్టీసీ బస్లకు 70శాతం, లైట్ మోటార్ వేహికిల్, హెవీ మోటార్ వాహనాలకు 50శాతం, తోపుడు బండ్లకు 75శాతం, నో మాస్క్ కేసుల్లో రూ.900 వరకు మాఫీ చేస్తున్నట్లు పేర్కొంది.