ఖైరతాబాద్, జనవరి 21 : అసోసియేషన్ ఆఫ్ హెల్త్ అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్(ఆహా) రాష్ట్ర అధ్యక్షుడిగా నిమ్స్ అనుసంధాన అధికారి, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మార్త రమేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో ఉన్న అలూమ్ని ఎడ్యుకేషన్ సెంటర్లో శనివారం ఆహా ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యక్షుడిగా డాక్టర్ మసూద్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ నరేందర్ కుమార్, సహాయ కార్యదర్శిగా డాక్టర్ శ్రీనివాస్రావు, కోశాధికారిగా విజయరెడ్డితో పాటు చీఫ్ ప్యాట్రన్గా డాక్టర్ సీ సత్యనారాయణ, సలహాదారుడిగా డాక్టర్ టీ దయాకర్, డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, డాక్టర్ కేటీ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ మార్త రమేశ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధ్యక్షత బాధ్యత అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పని చేస్తానని, సీనియర్ల సహాయ సహకారాలు తీసుకుంటానని పేర్కొన్నారు.