హైదరాబాద్ : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నియామక పరీక్షను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసింది. ఫిబ్రవరి 12న జరగాల్సిన ఏఈఈ పరీక్షను మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది. గేట్ పరీక్ష ఉన్నందున ఏఈఈ పరీక్షను వాయిదా వేసినట్లు పేర్కొంది.
అలాగే మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి నియామక పరీక్ష ప్రాథమిక కీని ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 11 నుంచి 15 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు చెప్పింది.
ఇదిలా ఉండగా.. ఉద్యోగాలిప్పిస్తామని కొందరు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందని, అభ్యర్థులు డబ్బులు ఇచ్చిమోసపోవద్దని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించింది. నియామకప్రక్రియ పారదర్శకంగా నిబంధనల మేరకు జరుగుతుందని పేర్కొంది. నియామక ప్రక్రియపై నకిలీ ప్రకటనలు నమ్మొద్దని కోరింది. వాస్తవ సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను చూడాలని చెప్పింది.