నాంపల్లి కోర్టులు, జనవరి 31 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లా స్పెషల్ బ్రాంచ్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్సై)గా పనిచేస్తున్న ఎర్ర లక్ష్మణ్ను నకిలీ పాస్పోర్టు వ్యవహారంలో సీఐడీ అధికారులు అరెస్టు చేశా రు. పాస్పోర్టు చట్టంతోపాటు ఐపీసీలోని 420, 465, 468, 471, 120-బీ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమో దు చేసి 15వ నిందితుడిగా చేర్చారు. బుధవారం ఆయనను కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు చంచల్గూడ జైలుకు తరలించారు.
శ్రీలంక దేశస్థుల నుంచి రూ.5 వేల చొప్పున వసూలు చేసి వారికి అక్రమంగా భారత పాస్పోర్టులు లభించేలా లక్ష్మణ్ సహకరించాడని సీఐడీ అధికారులు కేసు డైరీలో పేర్కొన్నారు. ఇదే కేసులో అబ్దుస్ సత్తార్ ఉస్మాన్ అలీ జవహరి, మహ్మద్ కమ్రుద్దీన్, పోచంపల్లి దేవరాజ్, చెప్పల సుభాష్, పెద్దూరి శ్రీనివాస్, మురళీధరన్ అనే ఆరుగురు నిందితులను మరో రెండ్రోజులు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వారిని గురువారం జైలు నుంచి సీఐడీ కార్యాలయానికి తరలించనున్నారు.