సిద్దిపేట : ప్రముఖ సాహితీ వేత్త, ఆధ్యాత్మిక వేత్త, అష్టావధాని అష్టకాల నృసింహరామ శర్మ(80) కన్నుమూశారు. గురువారం ఉదయం శర్మకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నృసింహరామ శర్మ అష్టావధానిగా ప్రఖ్యాతి గడించారు. అష్టావధానంతో సమకూరిన డబ్బుతో అనంతసాగర్లో సరస్వతి ఆలయాన్ని కట్టించారు.
అష్టావధాని అష్టకాల నృసింహరామ శర్మ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆధ్యాత్మిక, సాహితీవేత్తగా ఆయా రంగాలకు వారు చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. అష్టకాల ఆధ్మాత్మిక సాహిత్య కృషి.. సిద్ధిపేట ప్రాంత కీర్తి ప్రతిష్టలను మరింతగా ఇనుమడింపచేశాయన్నారు. వారితో తనకున్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
అష్టకాల నృసింహ రామ శర్మ మృతి పట్ల మంత్రి హరీష్ రావు తన సంతాపం ప్రకటించారు. శర్మ మరణం ఆధ్యాత్మిక, సాహిత్య రంగాలకు తీరని లోటు అని హరీష్ రావు పేర్కొన్నారు.