హైదరాబాద్, మార్చి 16(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ‘పార్లమెంటేరియన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. ఈ విషయాన్ని ఒవైసీ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఈ అవార్డు ప్రకటించిన లోక్మత్ పార్లమెంటరీ అవార్డ్స్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలని ఈ సందర్భంగా ఒవైసీ పేర్కొన్నారు. పీఎం ఆవాస్ యోజన మొదలుకొని పెగాసస్, విదేశీ ట్రిబ్యునల్స్ వరకు తన హోదాను ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించానన్నారు.