వనస్థలిపురం, అక్టోబర్ 11: మునుగోడు ఉప ఎన్నికలో ఆర్యవైశ్యుల మద్దతు టీఆర్ఎస్ పార్టీకేనని ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ కమిటీ రాష్ట్ర చైర్మన్ చింతల రవికుమార్గుప్తా తెలిపారు. నియోజకవర్గంలోని 7 మండలాల నాయకులతో హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ను కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రవికుమార్గుప్తా మాట్లాడుతూ.. టీఆర్ఎస్, రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్యులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయ అవకాశాలు కల్పించిందని కొనియాడారు.
అన్ని రంగాల్లో తమను ప్రోత్సహిస్తున్న నాయకత్వాన్ని బలపర్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపడంతోపాటు ఆయన విజయానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. కేటీఆర్ను కలిసివారిలో ఆర్యవైశ్య మహాసభ నాయకులు అమరవాది లక్ష్మీనారాయణ, భాస్కర్, పాలడుగు వెంకన్న, మాలగారి శ్రీను, పలు మండలాల ఆర్యవైశ్య నాయకులు ఉన్నారు.