హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను వచ్చే నెల నుంచి మొదలుపెడుతామని సమాచారశాఖ కమిషనర్ అర్వింద్కుమార్ తెలిపారు. చిన్న పత్రికలకు ఈ నెల నుంచే ప్రభుత్వ ప్రకటనలు విడుదల చేస్తామని చెప్పారు. ఈ ఏడాదికి చిన్న పత్రికల ప్రకటనల కోసం నిధులు కేటాయించే దిశగా చర్యలు తీసుకొంటామని వెల్లడించారు. మంత్రి కే తారకరామారావు ఆదేశాల మేరకు గురువారం సమాచారభవన్లో ఆయన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే క్రాంతికిరణ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు, చిన్న పత్రికల యాజమాన్యాలు ఎదురొంటున్న సమస్యలను అల్లం నారాయణ, క్రాంతికిరణ్ వివరించటంతో సానుకూలంగా స్పందించిన కమిషనర్, జర్నలిస్టులు, మీడియా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని చెప్పారు. జర్నలిస్టుల హెల్త్ కార్డులు చెల్లుబాటయ్యేలా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్న, మధ్యతరహా వార్తా పత్రికల సమస్యలు పరిషరించాలని అర్వింద్కుమార్కు తెలంగాణ ఎంప్యానల్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ నేతలు బిజిగిరి శ్రీనివాస్, సిరికొండ అగస్టీన్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ నేత రమణకుమార్ వినతి పత్రాన్ని అందజేశారు. సమావేశంలో సమాచారశాఖ అదనపు డైరెక్టర్లు నాగయ్య కాంబ్లే, కిశోర్బాబు, జాయింట్ డైరెక్టర్ జగన్, మీడియా అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ శుక్రవారం సోమాజికూడ ప్రెస్క్లబ్లో కృతజ్ఞత సభ నిర్వహిస్తామని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు, తెలంగాణ ఎంప్యానల్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ నేతలు వెల్లడించారు.