హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమ స్తే తెలంగాణ): అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నీతి ఆయోగ్ విడుదలచేసిన ‘అర్థ్ నీతి’ నివేదిక ప్రతిబింబించిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఈ నివేదికను చూసైనా ప్రతిపక్షాలు కండ్లు తెరువాలని హితవుపలికారు. అర్థ్ నీతి నివేదికపై బుధవారం వినోద్కుమార్ స్పందిస్తూ.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నార ని, ఆయన కృషి ఫలితం నీతి ఆయోగ్ నివేదికలో ప్రస్ఫుటమైందని తెలిపారు. తెలంగా ణ ఏడేండ్లలోనే అభివృద్ధి, సంక్షేమ రంగా ల్లో దేశంలోనే గొప్ప రాష్ట్రంగా నిలిచిందని అభినందించిన విషయాన్ని గుర్తుచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించాలని సూచించారు.